యాప్నగరం

పిడుగుపాటుకు దంపతులు మృతి..!

కడప జిల్లాలో సంభవించిన పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉంది.

TNN 3 Apr 2018, 8:33 pm
కడప జిల్లాలో సంభవించిన పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే... మంగళవారం (ఏప్రిల్ 3) సాయంత్రం కడప జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. చాపాడు మండలంలోని వెదురూరు గ్రామంలో పిడుగు పడి హుస్సేన్‌ పీర్‌, ఖాసీంబీ అనే దంపతులు మృతిచెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితీ విషమంగానే ఉంది.
Samayam Telugu pidugu


కర్నూలు జిల్లాల్లోనూ దీని ప్రభావం కనిపించింది. చాగలమర్రి మండలం, పెద్దవంగలి గ్రామంలో అకాల వర్షాలకు, భారీ గాలులతో పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.