యాప్నగరం

పిడుగుల వాన.. దంపతులు మృతి

తెలుగు రాష్ట్రాల్లో శనివారం (జూన్ 2) మధ్యాహ్నం పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అలగడపలో పిడుగుపాటు విషాదం నింపింది.

Samayam Telugu 2 Jun 2018, 8:00 pm
తెలుగు రాష్ట్రాల్లో శనివారం (జూన్ 2) మధ్యాహ్నం పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. తెలంగాణలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అలగడపలో పిడుగుపాటు విషాదం నింపింది. పిడుగు పడటంతో గ్రామానికి చెందిన దంపతులు మృతి చెందారు. ఎల్లవుల వెంకయ్య, నారమ్మ అనే దంపతులు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో గొర్రెలను మేపుతుండగా పిడుగుపడింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Samayam Telugu thunderstorm


మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం భయాందోళనలు కలిగించింది. భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విజయవాడలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఊడిపడ్డాయి. విపరీతంగా దుమ్మురేగటంతో రహదారులు నిర్మానుష్యమయ్యాయి. క్యుములో నింబస్ మేఘాల కారణంగా నగరంలో మిట్టమధ్యాహ్నం ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. అయితే.. వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

ఏపీలో మారిన వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పలుచోట్ల పిడుగులు పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. కలెక్టర్లు కింది స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి అందుకనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.