యాప్నగరం

మిరాకిల్.. ఇంటిపై పిడుగు పడ్డా ఆ తల్లీబిడ్డలకు ఏంకాలేదు!

ఉరుములు, పిడుగులు దాటికి ఇంట్లోని విద్యుత్ పరికరాలు మాడిమసైపోయినా ఓ తల్లీ బిడ్డ మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటం విశేషం

Samayam Telugu 12 Sep 2018, 10:29 am
సాధారణంగా ఎక్కడైనా పిడుగు పడితే ఆ ప్రదేశమంతా మాడి మసైపోతుంది. దీని ప్రభావం చుట్టుపక్కల వందల మీటర్ల వరకు ఉంటుంది. అలాంటిది తమ ఇంటిపై పిడుగు పడ్డా ఓ చిన్నారితోపాటు తల్లి ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడ్డారు. ఈ అద్భుతం విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ఏడాదిన్నర తన కుమారుడ్ని ఊయలలో తల్లి నిద్రపుచ్చుతుండగా తమ ఇంటిపైనే పిడుగుపడినా ఆ చిన్నారికి ఏమీ కాలేదు. ఆ బుజ్జాయిని నిద్రపుచ్చుతున్న అతని తల్లికి కూడా కించిత్తు ప్రమాదం జరగకపోవడం విచిత్రం. సబ్బవరంలోని సాయినగర్‌ కాలనీలో నక్క దేవప్రసాద్‌, సారూమ్‌ రోజా దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఏడాదిన్న వయసున్న బాబు వినయ్ రంజిత్ కూడా ఉన్నాడు.
Samayam Telugu పిడుగు పడ్డా క్షేమంగా


మంగళవారం సాయంత్రం వినయ్‌ ఏడుస్తుంటే చీరతో ఊయల కట్టిన రోజా బాబును అందులో వేసి నిద్ర పుచ్చుతోంది. అదే సమయంలో భారీ వర్షం కురిసి, ఓ పిడుగు వారి ఇంటిపై పడింది. చిన్నారి నిద్రపోతున్న ఊయల సైతం కాలిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్‌, ఫ్యాన్లు అన్నీ ధ్వంసమయ్యాయి. పిడుగుపాటుకు ఇంట్లోని ఫ్లోరింగ్ కూడా దెబ్బతింది. కానీ, ఊయలలో ఉన్న బాలుడికి, దాన్ని ఊపుతున్న తల్లికి మాత్రం చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఈ సంఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ వారిని మృత్యుంజయులంటున్నారు. అంతేకాదు బాలుడి తల్లి ఎంతో అదృష్టవంతురాలని పేర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.