యాప్నగరం

గుంటూరులో పిడుగుపాటు.. ఇద్దరు మృతి

గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నకరీకల్లు మండలం గుండ్లపల్లిలో శుక్రవారం (జూన్ 29) భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Samayam Telugu 29 Jun 2018, 10:09 pm
గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నకరీకల్లు మండలం గుండ్లపల్లిలో శుక్రవారం (జూన్ 29) భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు తేలుకుట్ల కోటయ్య(గుండ్లపల్లి), పాలిత్య శంకర్ నాయక్(తండా)లుగా గుర్తించారు. ఈ ఘటనలో 20 మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. మృతిపై ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వెంటనే పరిస్థితి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుంటుబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.