యాప్నగరం

​నిమజ్జనానికి తరలివస్తున్న గణనాథులు

జంట నగరాల రహదారులు గురువారం తెల్లవారుజాము నుంచి కోలాహలంగా మారాయి.

TNN 15 Sep 2016, 7:13 am
జంట నగరాల రహదారులు గురువారం తెల్లవారుజాము నుంచి కోలాహలంగా మారాయి. నేడు సామూహిక నిమజ్జనాల సందర్భంగా నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో గణనాథులు తరలివస్తున్నారు. గణనాథులను తీసుకువచ్చే వాహనాలు వరుసకట్టడంతో పాటూ, వచ్చే భక్త జనంతో చాలా వేడుక వాతావరణం ఏర్పడింది. భక్తులు నృత్యాలతో గణనాథులకు వీడ్కోలు పలికేందుకు తీసుకెళుతున్నారు.
Samayam Telugu tight security for ganesh immersion in hyderabad
​నిమజ్జనానికి తరలివస్తున్న గణనాథులు

జంటనగరాల్లో 21 ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు పోలీసులు. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ రూట్లను నిలిపివేశారు. అలాగే బయటి జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగర శివారులో ఆపేస్తున్నారు. ప్రతి నాలుగు కిలోమీటర్లకు గణేష్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 12 వేల సీసీకెమెరాలతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూనే రెండు వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.