ప్రధానమంత్రి మోడి మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం గట్టి భద్రత ఏర్పాట్లు చేపట్టింది. గజ్వెల్ కోమటిబండలో మిషన్ భగీరథ కార్యక్రమం ఆవిష్కరణకు వస్తున్న మోది రాక సందర్భంగా పోలీసులు హైదరాబాద్, మెదక్ లలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. మోది రానున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనీఖీలు చేపట్టారు. మెదక్ జిల్లాల్లో ఆందోళన చేస్తారన్న అనుమానంతో వామపక్షనేతలు, కాంగ్రెస్ నాయకులను పోలీసులు 20మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. గజ్వెల్ రహదారులపై ఆర్మీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. దీనికితోడు గజ్వెల్ సభకు వచ్చే దారుల్లో నడిచే ప్రతి వాహానాన్ని తనీఖీలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను ఆపి పూర్తిగా తనీఖీలు జరిపాకే పంపిస్తున్నారు. అనుమానం ఉన్నవారిని అరెస్టు చేస్తున్నారు. గజ్వెల్ బహిరంగ సభ తర్వాత బీజేపీ ఆధ్యర్యంలో హైదరాబాద్ ఎల్డీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోనూ గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
నీఘా నీడలో మెదక్, అరెస్టులు
ప్రధానమంత్రి మోడి మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం గట్టి భద్రత ఏర్పాట్లు చేపట్టింది.
Samayam Telugu 7 Aug 2016, 12:46 pm