యాప్నగరం

Titli: తీరం దాటిన 'తిత్లీ'.. ఉత్తరాంధ్రలో భారీవర్షాలు

తుపాను తీవ్రతకు ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Samayam Telugu 11 Oct 2018, 7:53 am
ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘తిత్లీ’ పెను తుపాను గురువారం (అక్టోబరు 11) తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు-పల్లిసారథి వద్ద తీరాన్ని తాకింది. తుపాను గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణిస్తుంది. గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపానులో అంతర్గతంగా గాలుల వేగం 155 నుంచి 187 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గాలుల తాకిడికి జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
Samayam Telugu cyclone


తుపాను తీవ్రతకు ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురువారం సాయంత్రం వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ కేంద్రం తెలిపింది. దీంతో ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ అయింది.

సోంపేటలో బుధవారం రాత్రి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి జిల్లా వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు విజయనగరంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలను సూచించారు. విశాఖ కలెక్టరేట్‌లో 1800 4250 0002 నంబర్ ను అందుబాటులో ఉంచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.