యాప్నగరం

బిల్డింగ్ పైనుంచి పడి పాప.. ఆ వెంటే బాలిక

సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పైనుంచి పడి 18 నెలల పాప మృతి చెందింది. ఆ పాపను కాపాడే ప్రయత్నం చేసిన మరో బాలిక కూడా దుర్మరణం చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Samayam Telugu 23 Aug 2018, 4:29 pm
సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పైనుంచి పడి 18 నెలల పాప మృతి చెందింది. ఆ పాపను కాపాడే ప్రయత్నం చేసిన మరో బాలిక కూడా దుర్మరణం చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. రైల్వే క్వార్టర్స్‌లోని 10 నంబర్ ఇంట్లో నివాసముంటున్న దంపతుల కుమార్తె శ్రావ్య (శ్రేయ) , అదే క్వార్టర్స్‌లో 9 వ నంబర్ ఇంట్లో ఉంటున్న దంపతుల పదేళ్ల మరో బాలిక మంగళవారం (ఆగస్టు 21) సాయంత్రం 5 గంటల సమయంలో మేడపైకి వెళ్లారు. అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్నారి శ్రావ్య.. మేడ అంచుకు వెళ్లిపోయింది.
Samayam Telugu sravya


అది గమనించిన బాలిక చిన్నారిని కాపడటానికి పరుగెత్తుకొచ్చింది. కానీ, అప్పటికే చిన్నారి కిందకి పడిపోయింది. మూడో అంతస్తు నుంచి కింద పడటంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. పాపను కాపడటానికి పరుగెత్తుకొచ్చిన బాలిక కూడా బిల్డింగ్ పైనుంచి పడి తీవ్ర గాయాలపాలైంది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృత్యువాతపడింది.

బిల్డింగ్ పైనుంచి పడిన చిన్నారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. చిన్నారి, బాలిక దుర్మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.