యాప్నగరం

శ్రీవారి దర్శనం తరహాలో ఏపీ ఎన్నికల్లో టోకెన్ సిస్టమ్

ఏపీ ఎన్నికల్లో ఈసీ టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. పొడవైన క్యూ లైన్లలో నిలబడే అవసరం లేకుండా ఈ విధానానికి రూపకల్పన చేస్తోంది.

Samayam Telugu 8 Feb 2019, 10:56 pm
ఏపీ ఎన్నికల కోసం పార్టీలే కాదు ఎలక్షన్ కమిషన్ కూడా సన్నద్ధం అవుతోంది. ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వినూత్న కార్యక్రమానికి ఈసీ శ్రీకారం చుట్టనుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద చాంతడంత క్యూలో నిలబడే అవసరం లేకుండా టీటీడీ తరహాలో టోకెన్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. శుక్రవారం అమరావతిలో రాజకీయ పార్టీల నేతలతో జరిగిన భేటీ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ విధానం వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
Samayam Telugu voting queue


జనవరిలో ఓటర్ల జాబితాను ప్రకటించిన ద్వివేది.. రాష్ట్రంలో 3.69 కోట్ల ఓటర్లున్నారని తెలిపారు. కొత్తగా 9 లక్షల అప్లికేషన్లు అందాయని, వీరిలో 7.5 లక్షల మంది యువ ఓటర్లని తెలిపారు. బోగస్ ఓటర్ల జాబితాపై రెండు వారాల్లో తనిఖీ పూర్తి చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం ఏపీకి రానుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.