యాప్నగరం

‘టీడీపీ చిత్తుగా ఓడిపోవడానికి పవన్ కళ్యాణే కారణం’!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం జరిగిన ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సుమన్ మీడియాతో మాట్లాడుతూ... కీలక వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 16 Jun 2019, 10:53 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఎన్నికల్లో టీడీపీ ఓటమికి గల కారణాలపై ప్రముఖ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం జరిగిన ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ప్రశంసలు కురించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు మంత్రి, డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టి సమన్యాయం చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపిన సుమన్, ఎన్నో కష్టాలు పడి ఆయన ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. తనకు ఊహతెలిసిన ఒకే పార్టీకి ఇన్ని సీట్లు రావడం ఇదే తొలిసారి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కారణమని అన్నారు. అంతేకాదు, ఆ పార్టీ చేసిన తప్పిదాల వల్లే చిత్తుగా ఓడిపోయిందని సుమన్ అన్నారు.
Samayam Telugu Hero-Suman


కాగా, మహిళలను గౌరవించి డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇచ్చిన ఘనత కూడా సీఎం వైఎస్‌ జగన్‌దేనని కొనియాడారు. ఏపీకి రావాల్సిన నిధులు వెంటనే కేంద్రం విడుదల చేయాలని ఆయన విజ్ఙ‌ప్తి చేశారు. అలాగే, సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి అన్నివిధాల ఆదుకోవాలని సీఎం జగన్‌ను కోరారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తున్నారని ప్రశంసించారు. ఇలాగే అన్ని వర్గాల ప్రజలకు వచ్చే ఐదేళ్లు న్యాయం చేస్తూ పోతే తర్వాత కూడా జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.