యాప్నగరం

అందరూ సైలెంట్‌గా ఉంటే, చార్మి ఎందుకిలా?

డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఎలాంటి హడావుడి చేయకుండా సిట్ విచారణకు హాజరవుతున్నారు. కానీ హీరోయిన్ చార్మి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించి, ఒక్కసారి నివ్వెరపోయేలా చేసింది.

TNN 24 Jul 2017, 1:03 pm
డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఎలాంటి హడావుడి చేయకుండా సిట్ విచారణకు హాజరవుతున్నారు. కానీ హీరోయిన్ చార్మి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించి, ఒక్కసారి నివ్వెరపోయేలా చేసింది. తన రక్త నమూనాలను తీసుకోరాదని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం సంచలనమే కలిగిస్తోంది. శ్యామ్ కే నాయుడు మినహా విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్‌ల రక్తం, గోళ్లు, తల వెంట్రుకలను ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందం సేకరించి వాటిని ఎఫ్ఎస్ఎల్ విభాగానికి పంపించిన విషయం తెలిసిందే. విచారణకు హాజరైన వారు మాదక ద్రవ్యాలు తీసుకున్నారనే పక్కా ఆధారాలతో సిట్ అధికారులు వారి నుంచి నమూనాలను సేకరిస్తున్నారు.
Samayam Telugu tollywood drug scandal why charmi moves to highcourt
అందరూ సైలెంట్‌గా ఉంటే, చార్మి ఎందుకిలా?


చార్మి మాత్రం తనకు ఇష్టం లేకుండా బ్లడ్ శాంపిల్‌ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ, ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3ని ఆమె ఉదాహరణగా చూపుతూ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఈ సెక్షన్ నార్కోటిక్స్ చట్టాలను ప్రస్తావిస్తుంది. దీని ప్రకారం, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులు, అనుమానితుల అనుమతితో థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా, లై డిటెక్షన్, పాలీ గ్రఫీ తదితర టెస్టులతో పాటు, రక్త నమూనాలతోనూ సాక్ష్యాలను సేకరించవచ్చు. అయితే అందుకు నిందితుల నుంచి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. ఒకవేళ నిందితులు పరీక్షలకు అంగీకరించకపోతే, మరో మార్గాన్ని విచారణ అధికారులు ఆశ్రయించాలి.

ఈ తరహా సాక్ష్యాలు కోర్టులో నేరాన్ని నిరూపించలేవు. గతంలోని పలు కేసుల్లో ఇదే విషయాలను కోర్టులు వెల్లడించాయి. ఈ సాంకేతిక విధానాల ద్వారా నిందితుడు స్వయంగా తనకు వ్యతిరేకంగా ఇచ్చుకునే సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోదు. చట్టంలోని ఈ లొసుగులే గతంలో ఎన్నో కేసులను నీరుగార్చాయి. సిట్ విచారణ తీరు సరిగా లేదంటూ ఛార్మి ఆరోపించింది. తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేకున్నప్పటికీ, నోటీసులు జారీ చేశారని... ఇది ఎంతవరకు సమంజమని ప్రశ్నించింది. సిట్ వ్యవహారం తన పరువుకు భంగం కలిగించేలా ఉందని తెలిపింది. ఈ నెల 26 న ఆమె సిట్ విచారణను ఎదుర్కోబోతోంది.

ఇక గడచిన మూడు నెలల కాలంలో డ్రగ్స్ తీసుకుంటే, దాని ఆనవాళ్లు వెంట్రుకలు, గోళ్లలో మినహా మరెక్కడా తెలియవు. అందుకే సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని నిర్దరించేందుకు సిట్ వారి రక్త నమూనాలు సేకరిస్తోంది. ఒకవేళ చార్మి ఈ మూడు నెలల్లోగా డ్రగ్స్ తీసుకుని ఉంటే ఆ విషయం బయటకు వస్తుంది. అందువల్లే తన రక్త నమూనాలు, గోళ్లు, తల వెంట్రుకలను ఇవ్వలేనని కోర్టును ఆశ్రయించినట్టు నిపుణులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.