యాప్నగరం

విచారణలో పూరి ఏం చెప్పాడంటే?

డ్రగ్స్ కేసు నేడు విచారణకు సిట్ అధికారుల ముందు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

TNN 19 Jul 2017, 1:34 pm
డ్రగ్స్ కేసు నేడు విచారణకు సిట్ అధికారుల ముందు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా సిట్ విచారణ బృందం ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే, పూరి మాత్రం ఏ మాత్రం తడబడకుండా సూటిగా, స్పష్టంగా సమాధానాలు ఇస్తున్నారట. కెల్విన్‌తో సంబంధాలపై అధికారులు అడిగిన ప్రశ్నకు పూరీ సూటిగానే సమాధానం ఇచ్చాడు. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్ లో కెల్విన్ ను కలిసిన విషయం నిజమేనని ఒప్పుకున్న పూరి, ఆ తర్వాత మాత్రం కెల్విన్‌తో రెగ్యులర్‌గా ఎలాంటి సంభాషణలు జరగలేదని వెల్లడించినట్లు సమాచారం. అంతే కాదు తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారట. సిట్ అధికారుల ప్రశ్నలకు పూరీ ఎలాంటి తడబాటు లేకుండా సమాధానాలు ఇవ్వడంతో విచారణకు పక్కా ప్లానింగ్‌తో వచ్చారని సిట్ వర్గాలు అంటున్నారు. ఇప్పటి వరకు 20 ప్రశ్నలకు పూరి సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఆయనతోపాటు వచ్చిన కుమారుడు ఆకాశ్‌తో సెల్ఫీల కోసం అధికారులు క్యూ కడుతున్నారు.
Samayam Telugu tollywood drugs scandal puri jagannath attend to sit enqiure
విచారణలో పూరి ఏం చెప్పాడంటే?


మరోవైపు పూరీని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న వేళ, ఆయన అభిమానులు ఎక్సైజ్ కార్యాలయానికి భారీ ఎత్తున చేరుకున్నారు. అక్కడే ఉన్న మీడియాతో వారు మాట్లాడుతూ, ఈ కేసులో పూరీ జగన్నాథ్ నిర్దోషిగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన మొత్తం 27 మంది పేర్లు ఉన్నాయని స్వయంగా సిట్ అధికారులే వెల్లడించారని, అయితే కేవలం 12 మందిని మాత్రమే విచారించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిగతా 15 మందిని సిట్ అధికారులు దాస్తున్నారా? నిర్మాతల మండలి దాస్తోందా? అగ్ర నిర్మాతలు కాపాడుతున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.