యాప్నగరం

అమరావతి కోసం రూ.20 లక్షలిచ్చిన నిర్మాత

రాజధాని నిర్మాణానికి ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోన్న విషయం తెలిసిందే.

Samayam Telugu 24 Apr 2018, 8:48 am
రాజధాని నిర్మాణానికి ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. సీఎం పిలుపు మేరకు రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయం చేయడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. తాజాగా అమరావతి నిర్మాణానికి ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు రూ.20 లక్షలు విరాళంగా అందజేశారు. తెలంగాణ టీడీపీ నేత, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యతో కలసి సోమవారం ఉండవల్లిలో చంద్రబాబుని కలసిన నారాయణరావు రూ.20 లక్షలకు చెక్కు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు రాజధాని నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఏటా రూ.10 లక్షల చొప్పున విరాళంగా ఇస్తానని నారాయణరావు తెలిపారు.
Samayam Telugu ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు


గతంలో రాజధాని అమరావతికి ఓ మహిళ రూ.కోటి విరాళమిచ్చారు. మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి చెందిన స్వరాజ్యలక్ష్మి అనే మహిళ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.కోటి విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. అలాగే తుళ్లూరుకు చెందిన రైతు వజ్జా రామలింగయ్య సైతం రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. గతంలో మహిళలు కూడా తమ ఒంటి మీద నగలను సైతం రాజధాని నిర్మాణానికి సమర్పించారు.కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన 14 ఏళ్ల అంబుల వైష్ణవి అనే బాలిక అమరావతి నిర్మాణానికి సైతంతన వంతు సాయం అందించింది. రాజధాని కోసం రూ.లక్ష విరాళం అందజేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.