పడిపోయిన ఉల్లి, టమోటా ధరలు: రైతుల కంట కన్నీరు
బహిరంగ మార్కెట్లో ఉల్లి, టమోటా ధరలు సాధారణంగా ఉన్నా వాటిని పండించే రైతులకు మాత్రం గిట్టుబాటు లభించడం లేదు. ప్రస్తుతం కిలో టమోటా రూ.16 నుంచి రూ.20 వరకు ఉండగా, రైతులకు మాత్రం కేవలం రూ.5 లోపే దక్కుతోంది.
Samayam Telugu 26 Aug 2018, 10:11 am
బహిరంగ మార్కెట్లో ఉల్లి, టమోటా ధరలు సాధారణంగా ఉన్నా వాటిని పండించే రైతులకు మాత్రం గిట్టుబాటు లభించడం లేదు. ప్రస్తుతం కిలో టమోటా రూ.16 నుంచి రూ.20 వరకు ఉండగా, రైతులకు మాత్రం కేవలం రూ.5 లోపే దక్కుతోంది. మరీ నాణ్యంగా ఉంటే దీని కంటే ఓ రూపాయి ఎక్కువ లభిస్తుంది. ఇక ఉల్లి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.15 చొప్పున అమ్ముతుంటే, రైతుకు సగటున దక్కేది రూ.ఆరులోపే ఉంటుంది. వినియోగదారులకు ధర తగ్గకపోగా, రైతుకు మాత్రం లాభం రావడం లేదు సరికదా కన్నీళ్లే మిగులుతున్నాయి.
టమోటా విరివిగా లభించే మదనపల్లి మార్కెట్లో జులై నెల ఇదే సమయానికి పది కిలోల మొదటి రకానికి సగటున రూ.230 వరకు లభిస్తే, రెండో రకానికి రూ.140 వరకు దక్కేది. కానీ ప్రస్తుతం అందులో సగం కూడా రావడం లేదు. మొదటి రకం టమోటా పది కిలోలకు సగటున రూ.90 చూపిస్తున్నా అదీ కొద్దిమందికి మాత్రమే అందుతోంది. ఎక్కువ మందికి కిలోకు రూ.5లోపే దక్కుతోంది. కర్నూలు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ కిలోకు సగటున రూ.2 - 3 కొంటున్నారు. ఇందులో కమీషన్, తరుగు కింద క్వింటాపై 20 కిలోలు మినహాయిస్తే రైతులకు పంట తరలింపు ఖర్చులు కూడా రావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో డిమాండు తగ్గడం, స్థానికంగా పంట పెరగుదలే మార్కెట్లో ధరలు పడిపోవడానికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. టమోటా గుజ్జు తయారుచేసే పరిశ్రమలు కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. మార్కెట్కు వచ్చే సరుకు కూడా తగ్గింది.
ఉల్లి సాగుకు కీలకమై కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 22 వేల హెక్టార్లలో పంట వేశారు. గతేడాదికి కిలోకు రూ.3 నుంచి రూ.6 మధ్యనే లభించడంతో ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. ఈ ఏడాదీ అదే పునరావృతమవుతోంది. కర్నూలు మార్కెట్లో కిలో ఉల్లి గరిష్ఠంగా రూ.10, కనిష్ఠంగా రూ.4.50 మాత్రమే దక్కుతోంది. మార్కెట్కు వేయి నుంచి 1,300 టన్నులు వస్తుంటే 700 నుంచి 800 టన్నులు మాత్రమే అమ్మకం జరుగుతోంది. మార్కెట్లో సరుకు పెరిగితే ధర పడిపోయే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే సాగు పెరగడం దీనికి కారణం అంటున్నారు.
టమోటా విరివిగా లభించే మదనపల్లి మార్కెట్లో జులై నెల ఇదే సమయానికి పది కిలోల మొదటి రకానికి సగటున రూ.230 వరకు లభిస్తే, రెండో రకానికి రూ.140 వరకు దక్కేది. కానీ ప్రస్తుతం అందులో సగం కూడా రావడం లేదు. మొదటి రకం టమోటా పది కిలోలకు సగటున రూ.90 చూపిస్తున్నా అదీ కొద్దిమందికి మాత్రమే అందుతోంది. ఎక్కువ మందికి కిలోకు రూ.5లోపే దక్కుతోంది. కర్నూలు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ కిలోకు సగటున రూ.2 - 3 కొంటున్నారు. ఇందులో కమీషన్, తరుగు కింద క్వింటాపై 20 కిలోలు మినహాయిస్తే రైతులకు పంట తరలింపు ఖర్చులు కూడా రావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో డిమాండు తగ్గడం, స్థానికంగా పంట పెరగుదలే మార్కెట్లో ధరలు పడిపోవడానికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. టమోటా గుజ్జు తయారుచేసే పరిశ్రమలు కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. మార్కెట్కు వచ్చే సరుకు కూడా తగ్గింది.
ఉల్లి సాగుకు కీలకమై కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 22 వేల హెక్టార్లలో పంట వేశారు. గతేడాదికి కిలోకు రూ.3 నుంచి రూ.6 మధ్యనే లభించడంతో ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. ఈ ఏడాదీ అదే పునరావృతమవుతోంది. కర్నూలు మార్కెట్లో కిలో ఉల్లి గరిష్ఠంగా రూ.10, కనిష్ఠంగా రూ.4.50 మాత్రమే దక్కుతోంది. మార్కెట్కు వేయి నుంచి 1,300 టన్నులు వస్తుంటే 700 నుంచి 800 టన్నులు మాత్రమే అమ్మకం జరుగుతోంది. మార్కెట్లో సరుకు పెరిగితే ధర పడిపోయే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే సాగు పెరగడం దీనికి కారణం అంటున్నారు.