యాప్నగరం

వాగులో చిక్కుకున్న టూరిస్ట్ బస్సు.. స్థానికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం చండ్రుపల్లి వాగులో ఓ టూరిస్టు బస్సు చిక్కుకుపోయింది. అయితే గ్రామస్థులు వెంటనే స్పందించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

Samayam Telugu 13 Aug 2018, 2:02 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం చండ్రుపల్లి వాగులో ఓ టూరిస్టు బస్సు చిక్కుకుపోయింది. అయితే గ్రామస్థులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పర్యాటకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం మూడు బస్సుల్లో బయలుదేరారు. ఈ క్రమంలో కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నారంలోని రెండో బ్యారేజిని సందర్శించి... కన్నెపల్లి పంప్ హౌస్ చూడటానికి బయలుదేరారు. అక్కడికి వెళ్లాలంటే మధ్యలో వాగులోనుంచి ప్రయాణించాలి.
Samayam Telugu bus


వాగులో నీటి ప్రవాహంలోనే రెండు బస్సులు ఒడ్డుకు చేరుకున్నాయి. అయితే మూడో బస్సు వస్తున్న క్రమంలో బస్సులోకి నీరు చేరడంతో బస్సు ఆగిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. కొంతమంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. బస్సుకు తాడు కట్టి మరోబస్సు సహాయంతో బయటకు లాగారు. దీంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.