ఖమ్మం మిర్చి రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు హాజరుపరచడాన్ని తెలంగాణ పీసీసీ తీవ్రంగా ఖండించింది. రైతులను సంకెళ్లతో బంధించడం దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నదాతలకు సంకెళ్లు వేయడం రైతు సమాజానికే అవమానమని ఆయన మండిపడ్డారు.
ఖమ్మం మిర్చి యార్డులో దాడికి పాల్పడ్డారంటూ పోలీసులు అరెస్టు చేసిన 10 మంది రైతులకు గురువారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పోలీసులు రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు.
రైతులకు సంకెళ్లు వేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం స్పందించి రైతు సమాజానికి క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రైతులను అవమానించిన బాధ్యలను సస్పెండ్ చేయాలన్నారు.
ఖమ్మం మిర్చి యార్డులో దాడికి పాల్పడ్డారంటూ పోలీసులు అరెస్టు చేసిన 10 మంది రైతులకు గురువారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పోలీసులు రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు.
రైతులకు సంకెళ్లు వేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం స్పందించి రైతు సమాజానికి క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రైతులను అవమానించిన బాధ్యలను సస్పెండ్ చేయాలన్నారు.