యాప్నగరం

ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఎక్కువ కబ్జాలు?

హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న భూ కుంభకోణాలపై తెలంగాణ కాంగ్రెస్ గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.

TNN 15 Jun 2017, 1:36 pm
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న భూ కబ్జాలతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. భూకబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానా రెడ్డి, షబ్బీర్ అలీలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న భూ కుంభకోణాలపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెరాస పాలనలో అత్యంత విలువైన స్థలాలన్నీ కబ్జాకు గురవుతున్నాయని, వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Samayam Telugu tpcc president uttam kumar reddy comments against kcr govt
ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ఎక్కువ కబ్జాలు?


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన నీళ్లు, నిధులు, వనరులు దోపిడీకి గురవుతున్నాయంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ పదేపదే మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీరు, వనరులు, భూములన్నీ మనకే దక్కుతాయని ఎంతో ఆశపడ్డామని... మన ఆశలకు అనుగుణంగానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఈ మూడేళ్లలో తెలంగాణ ప్రజల ఆస్తులను, వనరులను, నీళ్లను, భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇతరులకు తాకట్టు పెడుతూ వచ్చిందని మండిపడ్డారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే ప్రత్యేక తెలంగాణలోనే భూ కబ్జాలు ఎక్కువయ్యాయనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఉత్తమ్ తెలిపారు. భూకబ్జాలలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, కార్యాలయ అధికారులు, సన్నిహితులు ఉన్నారనే విషయానికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు ఆందజేశామని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.