యాప్నగరం

స్వాతి మరణించింది... మరి నరేష్ ఏమయ్యాడు?

ప్రేమ జంటలో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది... అబ్బాయి అదృశ్యమైపోయాడు.

TNN 18 May 2017, 2:58 pm
పెద్దల్ని ఎదిరించి పెళ్లాడిన ప్రేమ జంటలో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది... అబ్బాయి అదృశ్యమైపోయాడు. కొన్ని రోజులుగా కొడుకు జాడ తెలియక అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అతని ఆచూకీ కోసం తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై గురువారం కోర్టులో విచారణ జరిగింది. అసలేం జరిగిందంటే... యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన నరేష్ కు, భువనగిరికి చెందిన స్వాతితో ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. నరేష్ తల్లిదండ్రులు ముంబైలో ఉండగా, అతను తాత వద్ద ఉంటున్నాడు. రెండేళ్ల పాటూ ప్రేమించుకున్న స్వాతి, నరేష్ ముంబై వెళ్లిపోయి మార్చిలో పెళ్లి చేసుకున్నారు. 15 రోజుల క్రితం స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి వారిద్దరికీ వివాహం జరిపిస్తానని చెప్పి రప్పించారు. మే 11న ప్రేమికులిద్దరూ హైదరాబాద్ వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి స్వాతిని ఇంటికి తీసుకెళ్లారు. నరేష్ అదృశ్యమయ్యాడు. దీంతో నరేష్ పెదనాన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా స్వాతి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించింది. పోస్టుమార్టం నివేదికలో ఆమె గర్భవతని తేలింది.
Samayam Telugu tragedy husband goes missing his wife hanged self
స్వాతి మరణించింది... మరి నరేష్ ఏమయ్యాడు?


మరి నరేష్ ఏమయ్యాడు? స్వాతి తరపు వారే అతడిని ఏమైనా చేశారా అన్న అనుమానం నరేష్ కుటుంబీకుల్లో మొదలైంది. దీంతో అతని తల్లిదండ్రులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు జూన్ 1 లోగా నరేష్ జాడ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని పోలీసు శాఖను ఆదేశించింది. స్వాతి తండ్రినే పోలీసులు అనుమానిస్తున్నారు. అతడినే విచారిస్తున్నారు. ఆయన మాత్రం తనకేమీ తెలియదని చెబుతున్నాడు. అయితే స్వాతి ఆత్మహత్యకు, నరేష్ అదృశ్యానికి ఏదో లింకు ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.