యాప్నగరం

దేవరగట్టు కర్రల సమరంలో ఒకరి మృతి

కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా దసరా రోజున ‘బన్నీ ఉత్సవం’ పేరిట కర్రల సమరం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

TNN 1 Oct 2017, 11:16 am
కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా దసరా రోజున ‘బన్నీ ఉత్సవం’ పేరిట కర్రల సమరం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని చూడటానికి ఆయా గ్రామాల ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నుంచి జనం హాజరవుతారు. ప్రాణాలు పోతున్న, ఎంత మంది రక్తం చిందిస్తున్నా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ సంప్రదాయ ఉత్సవాన్ని అక్కడి ప్రజలు వదలడంలేదు. ఈ ఏడాది కూడా దేవరగట్టులో కర్రల సమరం జరిగింది.
Samayam Telugu tragedy in devaragattu bunny festival one dead 31 injured
దేవరగట్టు కర్రల సమరంలో ఒకరి మృతి


ఎప్పటిలాగే ఆలూరు సమీపంలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరులకు విజయదశమి పర్వదినాన రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లోని పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను వూరేగించారు. ఈ ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి రెండు వర్గాలుగా విడిపోయిన ప్రజలు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ సమరంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. ఇనుప చువ్వలున్న కర్రలతో జనాలు తలలు పగలగొట్టుకున్నారు. ఈ సమరంలో ఒకరు మృతి చెందగా, మరో 31 మంది గాయపడ్డారు.

మరోవైపు కాగడాల మంట అంటుకొని మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉత్సవం సందర్భంగా రక్తపాతం జరగకుండా చూసేందుకు దాదాపు 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయినా కొన్ని వందల మంది జనం కర్రలతో ఇష్టమొచ్చినట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుంటే పోలీసులు మాత్రం ఏం చేయగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.