హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చెందిన ఓ ట్రెయినీ హెలికాప్టర్ దుద్దెడ శివారులో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి హెలికాప్టర్ నడుపుతున్న మహిళా పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హెలీకాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ దాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే.. అది అంతకంటే ముందే పెద్ద శబ్దం చేస్తూ.. గాలిలోనే పేలిపోయింది. అప్రమత్తమైన పైలట్ రాసి రహెన్ పారాచూట్ సాయంతో కిందకు దిగారు. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి.
హైదరాబాద్ - కరీనంగర్ హైవేపై ఆకాశం నుంచి పారాచూట్ సాయంతో ఓ యువతి అకస్మాత్తుగా నడిరోడ్డుపై దిగడంతో వాహనదారులు ఆసక్తిగా గమనించారు. హకీంపేట నుంచి వస్తున్న ఈ ట్రెయినీ హెలీకాప్టర్ బయలుదేరిన కాసేపటికే పేలిపోయింది. ఆ తర్వాత మంటల్లో కాలి పూర్తిగా ధ్వంసమైంది. శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. హెలీకాప్టర్ పేలిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
ప్రమాదంలో గాయపడిన మహిళా పైలట్ను చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు. నూతనంగా నిర్మిస్తున్న సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చెందిన ఓ హెలీకాప్టర్ కీసర సమీపంలో కుప్పకూలి, కాలి బూడిదైన విషయం తెలిసిందే. సెప్పెంబర్ 28న జరిగిన ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ట్రెయినీ పైలట్లతో పాటు మరో ఆఫీసర్ సురక్షితంగా బయటపడ్డారు.
హైదరాబాద్ - కరీనంగర్ హైవేపై ఆకాశం నుంచి పారాచూట్ సాయంతో ఓ యువతి అకస్మాత్తుగా నడిరోడ్డుపై దిగడంతో వాహనదారులు ఆసక్తిగా గమనించారు. హకీంపేట నుంచి వస్తున్న ఈ ట్రెయినీ హెలీకాప్టర్ బయలుదేరిన కాసేపటికే పేలిపోయింది. ఆ తర్వాత మంటల్లో కాలి పూర్తిగా ధ్వంసమైంది. శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. హెలీకాప్టర్ పేలిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
ప్రమాదంలో గాయపడిన మహిళా పైలట్ను చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు. నూతనంగా నిర్మిస్తున్న సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చెందిన ఓ హెలీకాప్టర్ కీసర సమీపంలో కుప్పకూలి, కాలి బూడిదైన విషయం తెలిసిందే. సెప్పెంబర్ 28న జరిగిన ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ట్రెయినీ పైలట్లతో పాటు మరో ఆఫీసర్ సురక్షితంగా బయటపడ్డారు.