యాప్నగరం

ఎంపీ శివప్రసాద్ అవమానించారు: ట్రాన్స్‌జెండర్ తమన్నా

టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఎంపీ శివప్రసాద్ తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపించారు.

Samayam Telugu 13 Aug 2018, 6:42 pm
టీడీపీ ఎంపీ శివప్రసాద్‌పై ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఎంపీ శివప్రసాద్ తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ మేరకు విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించిన ఆందోళనలో భాగంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇటీవల హిజ్రా వేషం వేసిన సంగతి తెలిసిందే. తమ వేషధారణను, శరీర భాషను ఎంపీ అవమానించారంటూ పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu sivaprasad


తాము మహిళలతో సమానమని, శరీర భాగాలు మార్చుకుని మహిళలతో సమానంగా జీవిస్తున్న తమను ఎంపీ అవమానించారని పోలీసులకు తమన్నా ఫిర్యాదు చేశారు. ఎంపీ శివప్రసాద్ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.