మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. Orange ప్రయివేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో పన్నెండుమంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు మైసూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డివైడర్ను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
Samayam Telugu 14 Jan 2017, 10:46 am