యాప్నగరం

టీఆర్ఎస్‌ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం కలకలం

రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేయడం పార్టీని కలవరానికి గురిచేస్తోంది.

Samayam Telugu 1 Oct 2018, 9:50 pm
తెలంగాణ ముందస్తు ఎన్నికల కసరత్తులు జోరుగా సాగుతుండగా.. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీలో సీట్ల పంపకాలు అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు టికెట్ కోసం బాల్క సుమన్, నల్లాల ఓదేలు వర్గీయుల మధ్య పోరు టీఆర్ఎస్ కార్యకర్త గట్టయ్య ప్రాణం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేయడం పార్టీని కలవరానికి గురిచేస్తోంది.
Samayam Telugu TRS Activists suicide attempt


సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ కోసం టీఆర్ఎస్‌లో వర్గపోరు జరుగుతోంది. కోదాడ టికెట్‌ను టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు. ఈ టికెట్‌ను శశిధర్‌ రెడ్డి, చందర్‌రావు ఆశిస్తుండగా.. తమ వర్గానికే చెందిన శశిధర్‌ రెడ్డికే కేటాయించాలంటూ ఇద్దరు కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశారు. కేసీఆర్ సభకు జనసమీకరణ కోసం కోదాడలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం

తొలుత ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్న ఈ సమావేశంలో రాము అనే టీఆర్ఎస్ కార్యకర్త, శశిధర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని కోరుతూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా తోటి కార్యకర్తలు అడ్డుకుని నిలువరించారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహం వద్ద మరో కార్యకర్త శశిధర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కిరోసిన్‌ పోసుకున్నాడు. ఇది గుర్తించిన తోటి కార్యకర్తలు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని అతడికి నచ్చజెప్పారు. నేతల టికెట్ల కేటాయింపుల కోసం కార్యకర్తల ఆత్మహత్యాయత్నాలు టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారుతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.