యాప్నగరం

కనీవినీ ఎరుగని రీతిలో తెరాస సభకు ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర సమితి పదిహేడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు వరంగల్ లో వైభవంగా జరగనున్నాయి.

TNN 27 Apr 2017, 7:52 am
తెలంగాణ రాష్ట్ర సమితి పదిహేడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు వరంగల్ లో వైభవంగా జరగనున్నాయి. ఓరుగల్లులో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోనే అతి పెద్ద సభావేదికను సిద్ధం చేశారు. ఆ వేదికపై పది మంది ఇరవై మంది కాదు...ఏకంగా 600 మంది కూర్చోవచ్చునట. 140 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో సభావేదిక సిద్ధమైంది. సభా ప్రాంగణంలో మొత్తం గులాబీ రంగులో మెరిసిపోతోంది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా సకల ఏర్పాట్లను చేశారు. నెల రోజులుగా వరంగల్ తెరాస నేతలు ఈ వేదిక పనులు చూస్తున్నారు. గురువారం ఉదయం నుంచి ఆ ప్రాంతాన్ని పోలీసులు మోహరించారు. మొత్తం ప్రభుత్వమే అక్కడికి తరలి వస్తుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను భారీగా దించారు. ఎండల్లో విధులు నిర్వహించే పోలీసుల కోసం ప్రత్యేకంగా వీటిని తెచ్చారు.
Samayam Telugu trs all set for foundation day meeting in warangal
కనీవినీ ఎరుగని రీతిలో తెరాస సభకు ఏర్పాట్లు


సభావేదికకు దగ్గర్లో 700 మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో మొదటి వరుసలో మహిళలు, వృద్ధులు, మాజీ సైనికులు, వికలాంగులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 21 వైద్యశిబిరాలు, 12 అంబులెన్సులను రెడీగా ఉంచారు. సభను భారీగా విజయవంతం చేయాలన్న ఆలోచనతో తెరాస నేతలు భారీగా ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేశారు. 2,600 బస్సులు, 2,500 డీసీఎంలు, 18000 ఆటోలు ఏర్పాటు చేశారు.

కేసీఆర్ హైదరాబాద్ లో మధ్యాహ్నం మూడున్నరకు వరంగల్ బయలు దేరి వెళతారు. సభా కార్యక్రమాలు పూర్తయిన తరువాత ఆ రాత్రి వరంగల్ లోనే బస చేస్తారు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ఇంట్లో బసకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం వరంగల్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.