యాప్నగరం

టీఆర్ఎస్- టీజేఎసీ మధ్య వార్ !

రెండేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేరంటూ కోదండరాం చేసిన వ్యాఖ్యలు

Samayam Telugu 7 Jun 2016, 7:04 pm
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో కేసీఆర్ అధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ ముందుండంగా, అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపై వచ్చేలా తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఏర్పాటు చేసి అందరిదీ ఒకే గొంతుకగా వినిపించేలా చేసిన ఘనత ప్రొ. కోదండరాంకే దక్కుతుంది. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్, కోదండరాం, సకలజనులు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. అప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మార్పు చెందుతూ వచ్చింది. రాష్ట్రం కోసం పోరాడిన వారికే కాకుండా రాష్ట్రం రాకుండా అడ్డుకున్నవారికి కూడా టీఆర్ఎస్ పార్టీ పదవులను ఇస్తూ తమలో కలిపేసుకుంది. ఐతే రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన టీ.జేఎసి మాత్రం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. టీజేఎసీకి చైర్మన్ గా కొనసాగుతున్న ప్రొ. కోదండరాం తాను ప్రభుత్వంతో కలువకుండా ప్రభుత్వ పనితనాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తామని గతంలోనే తెలిపారు. అప్పట్నించే కోదండరాంకి, కేసీఆర్ కి మధ్య అగాధం ఏర్పడిందని వార్తలు వచ్చాయి, ఐతే వాటిని టీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేశాయి.
Samayam Telugu trs and tjac
టీఆర్ఎస్- టీజేఎసీ మధ్య వార్ !

తాజాగా, రెండేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేరంటూ కోదండరాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రులు, ఇతర టీఆర్ఎస్ నాయకులు కోదండరాంపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు కోదండరాం కూడా తనపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. టీజేఎసితో ప్రజలున్నారని, తమకు ఏ పదవులు, ఎవరి గుర్తింపు అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజల సమస్యలు తీరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. గత ముప్పై సంవత్సరాలుగా తాము తెలంగాణ సమస్యలపై పోరాడుతున్నామని, ఎవరి ఒత్తిడి మేరకో టీజేఎసి పనిచేయదని ఆయన తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ నాయకుల విమర్శలపై, ప్రజా సమస్యలపై జేఎసీలో చర్చించి తమ లక్ష్యాలపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు కోదండరాం తెలిపారు.
కాగా, కోదండరాంపై మంత్రులు విమర్శించడం పట్ల ప్రతిపక్షాలకు ఆయన బాసటగా నిలిచాయి, మరోవైపు తెలంగాణ వాదులు కూడా కోదండరాంకు మద్ధతుగా నిలుస్తున్నారు. ఆనాడు తెలంగాణకు అడ్డుపడుతూ ఇష్టారీతిన నోరు పారేసుకున్న పలువురు నేతలు ఈరోజు అధికారపక్షంలో చేరి వివిధ పదవులనుభవిస్తూ.. తెలంగాణ కోసం పోరాడి, ఎలాంటి పదవులు ఆశించని వ్యక్తిపై విమర్శలు చేయడం దారుణం అంటూ వారు మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.