యాప్నగరం

ఎమ్మెల్సీగా నవీన్‌ రావు ఏకగ్రీవ ఎన్నిక

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కుర్మయ్యగారి నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Samayam Telugu 31 May 2019, 6:45 pm
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు గురువారం (మే 30) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఒకే ఒక నామినేషన్ ఉండటంతో ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నవీన్‌రావుకు ఎన్నికకు సంబంధించిన ధ్రువపత్రాన్ని అందజేశారు.
Samayam Telugu Naveen


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్ రావుకు పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలిసి అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.