గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రగతి నివేదన సభ’ విజయవంతమవడంతో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఎన్నికల వేడి పుట్టింది. ఎన్నికల శంఖారావం పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్.. సెప్టెంబర్ 7న హుస్నాబాద్లో మరో భారీ బహిరంగ సభ తలపెట్టారు. సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించి 6.45 గంటలకు అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించనున్నట్లు సమాచారం. కేసీఆర్ 6 సెంటిమెంట్, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో చూస్తే..
1) లోక్ సభతో విడిగా అసెంబ్లీ ఎన్నికలు
లోక్సభకు, అసెంబ్లీకి విడిగా ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తామని చెప్పిన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ను ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీల్లో చాలా పార్టీలు దీనికి సానుకూలంగా స్పందించాయి. అయితే.. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న మమతా బెనర్జీ లాంటి నేతలు కాంగ్రెస్ను కలుపుకోకుండా ఆ పని చేయలేమని భావిస్తున్నారు.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్తో కలిసి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే పూర్తయితే మార్చి నాటికి అవసరమైనవిధంగా అడుగులు వేయొచ్చనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.
తాజా రాజకీయాలను గమనిస్తే.. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి దగ్గరవుతున్నట్టుగా కూడా సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎంఐఎం లాంటి పార్టీలతో ఇప్పటికే అనధికారికంగా సర్దుబాటు చేసుకున్న టీఆర్ఎస్.. అదే సమయంలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లలేదు. ఒకవేళ వెళ్లినా ఎన్నికల్లో ఫలితాలు విరుద్ధంగా రావొచ్చు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ముందస్తుకు మొగ్గు చూపుతున్నారనేది ఒక విశ్లేషణ.
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ వస్తే.. ఆ ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటే అవకాశం టీఆర్ఎస్కు ఉంటుంది. ఇదే సమయంలో హరీశ్ రావు, తుమ్మల లాంటి బలమైన నాయకులను పార్లమెంట్కు పంపించి కేంద్ర రాజకీయాల్లోనూ మరింత క్రియాశీల పాత్ర పోషించాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.
2) 2019తో పోలిస్తే 2018 బాగా కలిసొస్తుందని భావించడం
వాస్తు, జ్యోతిషం లాంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్.. 2019 కంటే 2018లోనే బాగా కలిసొస్తుందని భావిస్తున్నారట. 2018లో కేసీఆర్కు నక్షత్రాలు, గ్రహాల కదలికలు బాగా అనుకూలంగా ఉన్నట్లు పండితులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనూ ముందుస్తుకు వెళ్తున్నారనేది ఒక అభిప్రాయం.
3) ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్కు సానుభూతి పెరగడం
అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తున్నా.. చాలా కార్యక్రమాలు పూర్తి స్థాయి ఫలితాలను అందించే దిశకు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న అంశాన్ని కొట్టిపారేయలేం. విపక్ష కాంగ్రెస్ దీన్ని తనకు సానుకూలంగా మార్చుకోకముందే ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
4) పూర్తిస్థాయిలో నెవవేరని హామీలు
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో చాలా వరకు పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వట్లేదు. సమీప భవిష్యత్తులోనూ అవి నెవవేరుతాయనే నమ్మకం లేదు. ఇలాంటి అంశాలను విపక్షాలు తమ అస్త్రాలుగా మలుచుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం లేకుండా కేసీఆర్ ముందస్తుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఉదాహరణకు నిరుపేదలకు 2.61 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పగా.. ఇప్పటివరకూ 11 వేల ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు. మరో 25 వేల ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. అదేవిధంగా.. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పగా.. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పది రోజుల కింద కామారెడ్డిలో జరిగిన ఓ జాబ్ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు తరలిరాగా.. కేవలం 600 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. 25 వేల మందికి పైగా నిరాశగా తిరిగి వెళ్లిపోయారు.
దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారకముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు..
5) టీడీపీ, కాంగ్రెస్ మైత్రికి చెక్
కేసీఆర్ ముందుస్తు దిశగా ఆలోచించడానికి మరో కారణం.. ఇతర పార్టీలకు ఏ చిన్న అవకాశం ఇవ్వొద్దని భావించడం. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్తో టీడీపీ కాస్త సానుకూలంగా వ్యవహరిస్తోంది. హోదా విషయంలో కమలం పార్టీతో కటీఫ్ చేసుకున్న ఆ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాలని టీడీపీ భావిస్తే.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఎన్నికలు జరిగితేనే చంద్రబాబు ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఒకవేళ తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలు వచ్చి, కాంగ్రెస్తో టీడీపీ కలిసి పోటీ చేస్తే.. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే.. ఆ ప్రభావం ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనా పడవచ్చు. అందువల్ల చంద్రబాబు అలాంటి సాహసం చేసే అవకాశాలు తక్కువ.
ఇదే సమయంలో టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉన్న ఎంఐఎం కూడా ముందస్తుకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో డిసెంబర్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.
1) లోక్ సభతో విడిగా అసెంబ్లీ ఎన్నికలు
లోక్సభకు, అసెంబ్లీకి విడిగా ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తామని చెప్పిన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ను ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీల్లో చాలా పార్టీలు దీనికి సానుకూలంగా స్పందించాయి. అయితే.. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న మమతా బెనర్జీ లాంటి నేతలు కాంగ్రెస్ను కలుపుకోకుండా ఆ పని చేయలేమని భావిస్తున్నారు.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్తో కలిసి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే పూర్తయితే మార్చి నాటికి అవసరమైనవిధంగా అడుగులు వేయొచ్చనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.
తాజా రాజకీయాలను గమనిస్తే.. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి దగ్గరవుతున్నట్టుగా కూడా సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎంఐఎం లాంటి పార్టీలతో ఇప్పటికే అనధికారికంగా సర్దుబాటు చేసుకున్న టీఆర్ఎస్.. అదే సమయంలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లలేదు. ఒకవేళ వెళ్లినా ఎన్నికల్లో ఫలితాలు విరుద్ధంగా రావొచ్చు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ముందస్తుకు మొగ్గు చూపుతున్నారనేది ఒక విశ్లేషణ.
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ వస్తే.. ఆ ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటే అవకాశం టీఆర్ఎస్కు ఉంటుంది. ఇదే సమయంలో హరీశ్ రావు, తుమ్మల లాంటి బలమైన నాయకులను పార్లమెంట్కు పంపించి కేంద్ర రాజకీయాల్లోనూ మరింత క్రియాశీల పాత్ర పోషించాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.
2) 2019తో పోలిస్తే 2018 బాగా కలిసొస్తుందని భావించడం
వాస్తు, జ్యోతిషం లాంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్.. 2019 కంటే 2018లోనే బాగా కలిసొస్తుందని భావిస్తున్నారట. 2018లో కేసీఆర్కు నక్షత్రాలు, గ్రహాల కదలికలు బాగా అనుకూలంగా ఉన్నట్లు పండితులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనూ ముందుస్తుకు వెళ్తున్నారనేది ఒక అభిప్రాయం.
3) ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్కు సానుభూతి పెరగడం
అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తున్నా.. చాలా కార్యక్రమాలు పూర్తి స్థాయి ఫలితాలను అందించే దిశకు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న అంశాన్ని కొట్టిపారేయలేం. విపక్ష కాంగ్రెస్ దీన్ని తనకు సానుకూలంగా మార్చుకోకముందే ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
4) పూర్తిస్థాయిలో నెవవేరని హామీలు
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో చాలా వరకు పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వట్లేదు. సమీప భవిష్యత్తులోనూ అవి నెవవేరుతాయనే నమ్మకం లేదు. ఇలాంటి అంశాలను విపక్షాలు తమ అస్త్రాలుగా మలుచుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం లేకుండా కేసీఆర్ ముందస్తుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఉదాహరణకు నిరుపేదలకు 2.61 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పగా.. ఇప్పటివరకూ 11 వేల ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు. మరో 25 వేల ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. అదేవిధంగా.. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పగా.. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పది రోజుల కింద కామారెడ్డిలో జరిగిన ఓ జాబ్ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు తరలిరాగా.. కేవలం 600 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. 25 వేల మందికి పైగా నిరాశగా తిరిగి వెళ్లిపోయారు.
దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారకముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు..
5) టీడీపీ, కాంగ్రెస్ మైత్రికి చెక్
కేసీఆర్ ముందుస్తు దిశగా ఆలోచించడానికి మరో కారణం.. ఇతర పార్టీలకు ఏ చిన్న అవకాశం ఇవ్వొద్దని భావించడం. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్తో టీడీపీ కాస్త సానుకూలంగా వ్యవహరిస్తోంది. హోదా విషయంలో కమలం పార్టీతో కటీఫ్ చేసుకున్న ఆ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాలని టీడీపీ భావిస్తే.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఎన్నికలు జరిగితేనే చంద్రబాబు ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఒకవేళ తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలు వచ్చి, కాంగ్రెస్తో టీడీపీ కలిసి పోటీ చేస్తే.. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే.. ఆ ప్రభావం ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనా పడవచ్చు. అందువల్ల చంద్రబాబు అలాంటి సాహసం చేసే అవకాశాలు తక్కువ.
ఇదే సమయంలో టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉన్న ఎంఐఎం కూడా ముందస్తుకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో డిసెంబర్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.