యాప్నగరం

ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి అంత సీన్‌ లేదు!

డి. శ్రీనివాస్, అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఒక్కటయ్యారని.. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీపై కుట్రలకు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు.

Samayam Telugu 14 Sep 2018, 3:00 pm
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డితో సహా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వీరిని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంపై తాజా నిజామాబాద్ రూరల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి అంత సీన్ లేదని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు.
Samayam Telugu Baji Reddy Govardhan


ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ప్రజల మద్దతు ఉందని, భూపతిరెడ్డి పరిస్థితి అలా కాదని ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఒక్కటయ్యారని.. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీపై కుట్రలకు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. డీఎస్, భూపతిరెడ్డిల వ్యవహారాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తానెప్పుడూ తీసుకెళ్లలేదన్నారు. కానీ, ఆ నేతలు ఇద్దరు కలిసి కుమ్మక్కై తనను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని డీఎస్ పార్టీని బెదిరిస్తున్నారని, మరోవైపు భూపతిరెడ్డి చేసే ఆరోపణలు నిరాధారం అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ స్థానంలో తానే గెలుస్తానని బాజిరెడ్డి గోవవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.