యాప్నగరం

మంత్రి సమక్షంలోనే ఒంటికి నిప్పు.. పరిస్థితి విషమం

మంత్రి సమక్షంలోనే ఓ టీఆర్‌ఎస్ నేత కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం వికారాబాద్‌ జిల్లాలో సంచలనానికి కారణమైంది. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో బుధవారం (ఆగస్టు 30) జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల..

TNN 30 Aug 2017, 7:57 pm
మంత్రి సమక్షంలోనే ఓ టీఆర్‌ఎస్ నేత కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం వికారాబాద్‌ జిల్లాలో సంచలనానికి కారణమైంది. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో బుధవారం (ఆగస్టు 30) జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించి, కార్యకర్తల మధ్య సయోధ్య కుదర్చడానికి మంత్రి మహేందర్‌ రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి సర్ది చెప్పినా సంతృప్తి చెందని నేత.. ఆయుబ్‌ ఖాన్‌ ఒక్కసారిగా ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈయన గతంలో తాండూరు పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా పని చేశారు.
Samayam Telugu trs leader sets fire himself in front of minister mahender reddy
మంత్రి సమక్షంలోనే ఒంటికి నిప్పు.. పరిస్థితి విషమం


తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆయూబ్‌ ఖాన్‌ ఈ దారుణానికి ఒడిగట్టారు. వెంటనే ఆయణ్ని సమీప ఆసుపత్రికి తరలించారు. 60 శాతానికి పైగా శరీరానికి గాయాలు కావడంతో ఆయుబ్ ఖాన్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మంత్రి మహేందర్‌ రెడ్డి కూడా ఆయణ్ని తరలిస్తున్న వాహనం వెంటే వెళ్లారు. ప్రస్తుతం ఆయుబ్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.