తండ్రి ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత. తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తరవాత ఆయన కాంగ్రెస్ను వీడి గులాబీ కారెక్కారు. టీఆర్ఎస్ కూడా ఆయనకి మంచి పదవులే కట్టబెట్టింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగానూ ఉన్నారు. ఆయనవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆయనే.. పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్. అదేనండి డి.శ్రీనివాస్. ఇప్పుడు ఆయన తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం నిజామాబాద్లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో అరవింద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్ రాజ్నాథ్ సింగ్కు ఆనంద్ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పనితీరును చూసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. వ్యాపారవేత్త సదానంద్ రెడ్డి, కాంగ్రెస్ నేత బస్వా లక్ష్మీనర్సయ్య కూడా తమ మద్దతుదారులతో త్వరలో పార్టీలో చేరతారని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తరఫున తన తండ్రి ఎంపీగా ఉన్నప్పటికీ.. తన మనసు చెప్పినట్లు నడుచుకుంటున్నానని, అందుకే బీజేపీలో చేరానని అరవింద్ తన మద్దతుదారులకు చెప్పినట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి బీజేపీకి బలమైన నాయకుడు లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించే అరవింద్ పార్టీలో చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టీఆర్ఎస్లోకి వెళ్లడం.. ఇప్పుడు ఆయన తనయుడు బీజేపీలోకి వెళ్లడం. రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ గోడ దూకుతారో అంచనా వేయడం సామాన్య ప్రజలకి కష్టమే.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం నిజామాబాద్లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో అరవింద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్ రాజ్నాథ్ సింగ్కు ఆనంద్ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పనితీరును చూసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. వ్యాపారవేత్త సదానంద్ రెడ్డి, కాంగ్రెస్ నేత బస్వా లక్ష్మీనర్సయ్య కూడా తమ మద్దతుదారులతో త్వరలో పార్టీలో చేరతారని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తరఫున తన తండ్రి ఎంపీగా ఉన్నప్పటికీ.. తన మనసు చెప్పినట్లు నడుచుకుంటున్నానని, అందుకే బీజేపీలో చేరానని అరవింద్ తన మద్దతుదారులకు చెప్పినట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి బీజేపీకి బలమైన నాయకుడు లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించే అరవింద్ పార్టీలో చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టీఆర్ఎస్లోకి వెళ్లడం.. ఇప్పుడు ఆయన తనయుడు బీజేపీలోకి వెళ్లడం. రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ గోడ దూకుతారో అంచనా వేయడం సామాన్య ప్రజలకి కష్టమే.