తెలంగాణలోనూ త్వరలో ఎయిమ్స్ ఏర్పాటుకానుంది. దీనికి అంగీకరిస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రకటన చేశారు. కేంద్రం.. అతి త్వరలోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరనుంది. 2017-18 బడ్జెట్పై మాట్లాడే సందర్భంలో.. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి ఎయిమ్స్కు సంబంధించి ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్లో రైతుల రుణమాఫీకి కేంద్రం సహకారం అందిస్తోందని, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా సహకరించాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజనను త్వరగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు త్వరలో ఎయిమ్స్
తెలంగాణలోనూ త్వరలో ఎయిమ్స్ ఏర్పాటుకానుంది.
TNN 20 Mar 2017, 6:46 pm