యాప్నగరం

50 రోజుల్లో 100 సభలు.. ఈ నెల 7న హుస్నాబాద్‌లో ప్రజల ఆశీర్వాద సభ: హరీష్

ముందస్తు ముహూర్తం ముంచుకొస్తోందా. మొన్న ప్రగతి నివేదన.. ఇప్పుడు ప్రజల ఆశీర్వాద సభ. 50రోజుల్లో 100 సభలతో టీఆర్ఎస్ అదే సంకేతాలు ఇస్తోందా..

Samayam Telugu 4 Sep 2018, 6:30 pm
ముందస్తు మూడ్‌లో టీఆర్ఎస్ ఫుల్ జోష్‌తో దూసుకెళ్తోంది. ప్రగతి నివేదన సభ సూపర్ హిట్ కావడంతో.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్.. మంత్రులు, టీఆర్ఎస్ నేతలకు సూచనలు చేశారు. ఈ నెల 7న హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ బస్సు డిపో పక్కనున్న స్థలాన్ని మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌తో పాటూ నేతలు పరిశీలించారు. అలాగే మండలాలవారీగా ఇంఛార్జ్‌లను నియమించారు.
Samayam Telugu TRS


రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే సభలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభకు ‘ప్రజల ఆశీర్వాద సభ’గా పేరు పెట్టామన్నారు. ప్రగతి నివేదన సభకు ప్రజల నుంచి ఊహించని మద్దతు వచ్చిందని.. ఈ సభలు కూడా తప్పకుండా విజయవంతం అవుతాయన్నారు.

తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్‌ సభలకు ప్లాన్ చేస్తుండటంతో.. ముందస్తు ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టింది. ఈ నాలుగేళ్లలో ఏం చేశామో చెబుతూనే.. మరోసారి టీఆర్ఎస్‌ను ఆశీర్వదించాలంటూ ప్రజల మద్దతు కూడగట్టే వ్యూహాల్లో ఉంది. ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా.. చాప కింద నీరులా గ్రౌండ్ వర్క్ చేసుకుంటోంది గులాబీ పార్టీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.