యాప్నగరం

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి: మోహన్‌బాబు

ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ్ముడూ అని సంబోధిస్తూ మోహన్‌బాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

Samayam Telugu 11 Nov 2018, 1:33 pm
తెలంగాణలో వరుసగా రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఎన్నికల సర్వేలతో పాటు సినీ సెలబ్రిటీలు కొందరు గూలాబీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా సినీ నటుడు, ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్‌బాబు సైతం టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Samayam Telugu Mohanbabu


విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో ఆలయ సిబ్బందికి మోహన్‌బాబు వస్త్రదానం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అర్చకుల తరఫున స్వరూపానందేంద్ర స్వామిజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ్ముడూ అని సంబోధిస్తూ మోహన్‌బాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఈ కార్యకమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాలపై మంచువారి కుటుంబసభ్యులు, సినీ నటులు మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పాజిటీవ్‌గా స్పందించడం తెలిసిందే. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోహన్‌బాబు టీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలవాలని కోరుకోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.