యాప్నగరం

కోటా పెంపు బిల్లుకు మండలి ఆమోదం

గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లును తెలంగాణ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.

Samayam Telugu 16 Apr 2017, 6:28 pm
గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లును తెలంగాణ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆదివారం తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రత్యేకంగా సమావేశమయ్యాయి.
Samayam Telugu ts council passes st muslim reservations hike bill
కోటా పెంపు బిల్లుకు మండలి ఆమోదం


ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లుపై శాసనమండలిలో రెండు గంటల పాటు సుధీర్ఘంగా చర్చించారు. దీనితో పాటు వారసత్వ కట్టడాల (హెరిటేజ్) బిల్లు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ బిల్లు)లపై కూడా చర్చించారు. ఏలాంటి సవరణలు లేకుండా శాసనమండలి ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన గిరిజన, బీసీ-ఈ (ముస్లిం) రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఎస్టీలకు ప్రస్తుతం అమలవుతున్న 6శాతం రిజర్వేషన్లకు అదనంగతా మరో నాలుగుశాతం కలిపి మొత్తం 10శాతం దక్కనున్నాయి. అటు ముస్లింలకు బీసీ-ఈ కోటాలో అమలవుతున్న 4శాతం రిజర్వేషన్లకు 8శాతం అదనంగా చేరి మొత్తం 12శాతం వరకు దక్కనున్నాయి.

అయితే రాజ్యాంగం ప్రకారం ఆయా రాష్ట్రాల్లో అన్ని కోటాలు (ఎస్సీ,ఎస్టీ,బీసీ) కలిపి 50శాతం రిజర్వేషన్లు మించరాదనే నిబంధన ఉన్నందున.. తమిళనాడు రాష్ట్రంలో 50శాతానికి పైగా అమలవుతున్నట్లు తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది.

రిజర్వేషన్ల పెంపు బిల్లుతోపాటు ఇతర బిల్లులను ఆమోదించిన అసెంబ్లీ, శాసనమండలి నిరవధికంగా వాయిదా పడ్డాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.