యాప్నగరం

రేపే తెలంగాణాలో ఎంసెట్

తెలంగాణా రాష్ట్రంలో మే 15న అనగా ఆదివారం నాడు ఎంసెట్ పరీక్ష జరగనుంది.

TNN 14 May 2016, 10:17 am
తెలంగాణా రాష్ట్రంలో మే 15న అనగా ఆదివారం నాడు ఎంసెట్ పరీక్ష జరగనుంది. దీనికి కావాల్సిన ఏర్పట్లన్నింటినీ అధికారులు పూర్తి చేశారు. దాదాపు 2.46 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5.30 వరకు అగ్రికల్చరల్, మెడికల్ పరీక్ష జరుగుతుంది. ఇంజినీరింగ్ పరీక్షకు 1,43,516 మంది హాజరవ్వబోతున్నారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష రాసేందుకు 1,01014 మంది హాజరవ్వబోతున్నారు. గతేడాదితో పోలిస్తే ఎంసెట్ రాసేవారి సంఖ్య 12వేలు పెరిగింది. తెలంగాణ ఎంసెట్ రాసేందుకు ఆంధ్రప్రదేశ్ లో కూడా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి 43,159 మంది దరఖాస్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.