యాప్నగరం

గంట పనికి రూ.5 లక్షల కూలీ!

ఆసుపత్రిలో గంటపాటు చేసిన సేవలకు గాను లక్ష్మారెడ్డికి యశోదా హాస్పిటల్ యాజమాన్యం రూ. 5 లక్షల చెక్కును అందజేసింది.

TNN 22 Apr 2017, 7:37 pm
టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు జనాన్ని తరలించడానికి అవసరమయ్యే ఖర్చుల కోసం ఆ పార్టీ నేతలు, మంత్రులు కూలీ పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో కూలీ పని చేశారు. ఓ పేషెంట్‌ను స్టెచర్‌పై వార్డ్‌కు తరలించారు. ఆర్థోపెడిక్‌ విభాగంలో ఓ రోగికి డ్రెస్సింగ్‌ చేశారు. మరో వృద్ధ రోగిని వీల్‌చైర్‌పై ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు తీసుకొచ్చారు. తమ ఆసుపత్రిలో గంటపాటు చేసిన సేవలకు గాను లక్ష్మారెడ్డికి యశోదా హాస్పిటల్ యాజమాన్యం రూ. 5 లక్షల చెక్కును అందజేసింది.
Samayam Telugu ts health minister laxma reddy works for 1 hour in a hospital
గంట పనికి రూ.5 లక్షల కూలీ!


మరోవైపు సభ జరగనున్న తేదీ దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూలీ పనులను మరింత వేగవంతం చేశారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హోటళ్లు, హాస్పిటళ్లు, ఇతర ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూలీ పనులు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.