యాప్నగరం

ఏపీ మంత్రితో ఫోన్లో మాట్లాడిన హరీష్

ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావుతో మంత్రి హరీష్ రావు ఫోన్‌లో మాట్లాడారు. నీటి కోసం తుంగభద్ర బోర్డుకు ఉమ్మడిగా ఇండెంట్ పెట్టేందుకు ఇరువురు మంత్రులు అంగీకరించారు.

TNN 3 Jan 2018, 9:53 pm
ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావుతో మంత్రి హరీష్ రావు ఫోన్‌లో మాట్లాడారు. నీటి కోసం తుంగభద్ర బోర్డుకు ఉమ్మడిగా ఇండెంట్ పెట్టేందుకు ఇరువురు మంత్రులు అంగీకరించారు. దీంతోపాటు తుంగభద్ర డ్యామ్ నుంచి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటి విడుదల అంశంపై దేవినేనితో హరీష్ చర్చించారు. మంత్రుల చర్చ మేరకు తుంగభద్ర డ్యాం నుంచి గురువారం (జనవరి 4) నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Samayam Telugu ts irrigation minister harish rao phone call to ap minister devineni
ఏపీ మంత్రితో ఫోన్లో మాట్లాడిన హరీష్


మరోవైపు జనవరి 8, 9 తేదీల్లో ఉదయ్‌పూర్‌లో జరగనున్న ఆలిండియా విప్‌ల సదస్సుకు టీఆర్‌ఎస్ పార్టీ తరఫున మంత్రి హరీశ్ రావు హాజరుకానున్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ సెక్రటరీ డా. నర్సింహాచార్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఈ సదస్సులో పాల్గొననున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.