నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చే భక్తులను నిలువుదోపిడీ చేసి వేలాది రూపాయలు దండుకున్న వ్యాపారులు హైకోర్టు దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు కఠిన చర్యలు చేపట్టడంతో హోటళ్ల ముందు ధరల పట్టికలు ఏర్పాటుచేశారు. హైకోర్టు పేర్కొన్న విధంగా ధరల పట్టికలు దుకాణాలు, హోటళ్ల ముందు దర్శనమిస్తున్నాయి. నిన్నటివరకూ రూ. 25 గా ఉన్న రెండు ఇడ్లీల ధర రూ. 7.50కు తగ్గింది. రూ. 15 వరకూ అమ్మిన టీ ధర రూ. 5, రూ. 100 వసూలుచేసిన ఫుల్ మీల్స్ రూ. 31కి దిగి వచ్చింది. ఇక వెజిటబుల్ పలావ్ ధర రూ. 50 నుంచి రూ. 19కి, ప్లేటు ఉప్మా రూ. 20 నుంచి రూ. 9కి, ప్లేట్ మీల్స్ ధర రూ. 60 నుంచి రూ. 22.50కు తగ్గాయి. అన్ని రకాల ఆహార ఉత్పత్తులు, తినుబండారాల ధరలూ సగానికి పైగా తగ్గాయి.
పట్టికలో చూపిన ధరలకన్నా ఎక్కువకు అమ్మితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించే ఫోన్ నంబర్లను సైతం హోటళ్లలో ప్రదర్శిస్తున్నారు. అయితే, తమదగ్గర వసూలు చేస్తోన్న అద్దెలు భారీగా ఉంటున్నాయని, వాటిని తగ్గిస్తేనే వ్యాపారాలు చేసుకోగలమని యజమానులు వాపోతున్నారు. ఈ విషయంపై చర్చించి త్వరలోనే నిర్ణయానికి వస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. కొండపై ప్రస్తుతం 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150కి పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 30 వరకూ చిరు దుకాణాలు ఉన్నాయి. కేవలం రెండు రోజులు హడావుడి చేసి వదిలేయకుండా, ఇదే పరిస్థితిని పక్కాగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.
పట్టికలో చూపిన ధరలకన్నా ఎక్కువకు అమ్మితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించే ఫోన్ నంబర్లను సైతం హోటళ్లలో ప్రదర్శిస్తున్నారు. అయితే, తమదగ్గర వసూలు చేస్తోన్న అద్దెలు భారీగా ఉంటున్నాయని, వాటిని తగ్గిస్తేనే వ్యాపారాలు చేసుకోగలమని యజమానులు వాపోతున్నారు. ఈ విషయంపై చర్చించి త్వరలోనే నిర్ణయానికి వస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. కొండపై ప్రస్తుతం 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150కి పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 30 వరకూ చిరు దుకాణాలు ఉన్నాయి. కేవలం రెండు రోజులు హడావుడి చేసి వదిలేయకుండా, ఇదే పరిస్థితిని పక్కాగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.