యాప్నగరం

టీటీడీ‌లో నూతన సంప్రదాయం.. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని పరిధిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 15 Jul 2019, 10:55 pm
టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎనిమిదేళ్లపాటు టీటీడీ జేఈవోగా ఉన్న శ్రీనివాసు రాజును పక్కనబెట్టారు. వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల రావాలని, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా.. టీటీడీలో మరో నూతన సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుట్టారు. తాడేపల్లి కేంద్రంగా చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చెయ్యాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.
Samayam Telugu ys subba reddy


చైర్మన్ ఆదేశాల మేరకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగులను నియమించాలని విజయవాడ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ రాజేంద్రుడు సర్వీసెస్ డిప్యూటీ ఈఓను కోరారు. తాడేపలిల్లో ఇప్పటికే సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు ఉండగా.. త్వరలోనే టీడీపీ చైర్మన్ క్యాంప్ ఆఫీసు కూడా ప్రారంభం కాబోతుందన్న మాట.
వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్‌కు బాబాయి అవుతారనే సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా ఆయన్ను నియమించడం పట్ల విమర్శలు వచ్చాయి. ఆయన హిందువు కాదని కూడా దుష్ప్రచారం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.