తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాశ్వత ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు తాజాగా తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్కి నోటీసులు ఇచ్చారు. అనూహ్యంగా.. తొలిసారి జేఏసీగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు ఈ నోటీసు ఇవ్వడంతో ఇప్పుడు తితిదేని కలవరపాటుకి గురిచేస్తోంది. మరోవైపు ఒప్పంద కార్మికులు సైతం.. ఈరోజు సమ్మె నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తితిదేలో 8,200 మంది శాశ్వత ఉద్యోగులు, 14,500 మంది ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. పదమూడేళ్ల క్రితం అంటే.. 2005లో తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా దాదాపు 50రోజులకి పైగా ఉద్యోగులు సమ్మె చేశారు. అప్పట్లో దిగివచ్చిన తితిదే.. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే.. ఇప్పటికీ కొన్ని సమస్యలు అలానే ఉండటంతో.. తాజాగా ఉద్యోగులు ఏకమై.. తితిదేని ఇరకాటంలో పడేశారు.
గత ఏడాదికాలంగా ఉద్యోగుల విషయంలో తితిదే కఠిన వైఖరి అవలంబిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. చిన్న పొరపాట్లకే సస్పెన్షన్ నోటీసులు ఇవ్వడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు.. నాలుగేళ్లక్రితం 16 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వారి ఆందోళనకి మరో కారణంగా తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి ఆగస్టు 16వ వరకు ఉద్యోగులు గడువు విధించారు.
ప్రస్తుతం తితిదేలో 8,200 మంది శాశ్వత ఉద్యోగులు, 14,500 మంది ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. పదమూడేళ్ల క్రితం అంటే.. 2005లో తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా దాదాపు 50రోజులకి పైగా ఉద్యోగులు సమ్మె చేశారు. అప్పట్లో దిగివచ్చిన తితిదే.. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే.. ఇప్పటికీ కొన్ని సమస్యలు అలానే ఉండటంతో.. తాజాగా ఉద్యోగులు ఏకమై.. తితిదేని ఇరకాటంలో పడేశారు.
గత ఏడాదికాలంగా ఉద్యోగుల విషయంలో తితిదే కఠిన వైఖరి అవలంబిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. చిన్న పొరపాట్లకే సస్పెన్షన్ నోటీసులు ఇవ్వడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు.. నాలుగేళ్లక్రితం 16 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వారి ఆందోళనకి మరో కారణంగా తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి ఆగస్టు 16వ వరకు ఉద్యోగులు గడువు విధించారు.