యాప్నగరం

రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు

టీటీడీ, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినవారిపై చర్యలు ప్రారంభమయ్యాయి. టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో పాటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు వెళ్లాయి.

Samayam Telugu 13 Jun 2018, 12:56 pm
టీటీడీ, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినవారిపై చర్యలు ప్రారంభమయ్యాయి. టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో పాటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు వెళ్లాయి. దేవస్థానం పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ఇద్దరిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సంజాయిషీ కోరింది టీటీడీ. స్పందించని పక్షంలో ఇద్దరిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.
Samayam Telugu Ramana


ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీటీడీతో పాటూ రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయన్నారు. ఏపీ పోలీసుల మీద తమకు నమ్మకం లేదని.. తెలంగాణ పోలీసులు, సీబీఐ కాని సీఎం ఇంట్లో సోదాలు చేస్తే అవి బయటపడతాయన్నారు. ఇటు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా ఆరోపణలు చేశారు. ఆయన చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించి.. టీటీడీతో పాటూ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. శ్రీవారి ఆభరణాల లెక్క తేలాలని.. స్వామివారికి పూజా కైంకర్యాలు సరిగా జరగడం లేదని.. కొండపై అపచారాలు జరుగుతున్నాయని విమర్శించారు.

తిరుమలలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే అంశం ఈ నెల 5న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఆరోపణల్ని సీరియస్‌గా తీసుకున్న పాలకమండలి.. దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. న్యాయ నిపుణల సలహా మేరకు ముందుకు వెళ్లానని నిర్ణయించి.. ఇప్పుడు నోటీసులు పంపించారు. త్వరలోనే మరికొంతమందికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.