యాప్నగరం

ఆ అధికారినే రమణదీక్షితులు తప్పుదోవ పట్టించారా?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి ఆభరణాలపై ఇప్పటి వరకూ ప్రధాని అర్చకుడిగా వ్యవహరించిన రమణదీక్షితులే ఆరోపణలు చేయడంతో వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది.

Samayam Telugu 27 May 2018, 3:41 pm
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి ఆభరణాలపై ఇప్పటి వరకూ ప్రధాని అర్చకుడిగా వ్యవహరించిన రమణదీక్షితులే ఆరోపణలు చేయడంతో వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. అయితే ఆయన చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని గతంలో టీటీడీలో ఉన్నతాధికారులుగా పనిచేసివారు సైతం ఖండిస్తున్నారు. తాజాగా శ్రీవారి ఆలయ భద్రత పర్యవేక్షణ మాజీ అధికారి బీవీ రమణకుమార్ స్పందిస్తూ.. రమణదీక్షితులు విమర్శలపై మండిపడ్డారు. శ్రీవారి ఆభరణాల విషయంలో ప్రధాన భద్రతా పర్యవేక్షణాధికారినే తప్పుదోవ పట్టించిన ఆయన, స్వామివారి నగల భద్రతపై ఆరోపణలు చేయడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన, టీటీడీలో ప్రస్తుతం నెలకొన్న వివాదంపై స్పందించారు.
Samayam Telugu రమణదీక్షితులు


బ్రహోత్సవాల్లో భాగంగా భక్తులు విసిరిన నాణేలకు శ్రీవారి హారంలోని గులాబీ రంగు వజ్రం పగిలిపోయిందని 2001లో ప్రధానార్చకులుగా ఉన్న రమణ దీక్షితులు, భద్రతాధికారిగా ఉన్న తనకు స్వయంగా రాసిచ్చారని ఆయన గుర్తు చేశారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి తాను నివేదిక అందజేశానని రమణకుమార్ తెలిపారు. అయితే ఈ పరిణామం అనంతరం, ఏర్పాటుచేసిన జగన్నాథరావు కమిటీ అది వజ్రం కాదు రూబీ అని తేల్చిందని స్పష్టం చేశారు. కమిటీ నివేదిక సమర్పణ సమయంలో ఏమీ మాట్లాడని రమణదీక్షితులు, పదేళ్ల తర్వాత ప్రస్తుత వ్యవస్థపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆక్షేపించారు. మరోవైపు తిరుమలలో మాయమైపోయిందని చెబుతున్నది కెంపు మాత్రమే నని, అది పగిలిపోయే రోజున తాను టీటీడీ జేఈఓగా ఉన్నట్టు విశ్రాంత ఐఏఎస్ బాలసుబ్రమణ్యం అన్నారు.

2001లో బ్రహోత్సవాల్లో భాగంగా గరుడోత్సవం రోజున భక్తులు స్వామివారి మీదకు నాణేలు విసరడంతో గులాబీ రంగు కెంపు పగలిపోయిందని పేర్కొన్నారు. గరుడోత్సవం రోజున భక్తులు స్వామివారిపైకి నాణేలు విసరడం ఆనవాయితీ.. నాణేలు తగిలి ఒకసారి తాను కూడా గాయపడ్డానని తొమ్మిదన్నరేళ్లు టీటీడీ జేఈఓగా పనిచేసిన బాలసుబ్రమణ్యం తెలియజేశారు. ఉత్సవం ముగిసిన తర్వాత రంగనాయకులు మండపంలో స్వామివారి ఆభరణాలను తీసినప్పుడు, హారంలో విరిగిన రూబీ ముక్కలను వేరుచేసి మూటకట్టి ఖజానాలో భద్రపరిచారని, దీన్ని ఫోటోలు, వీడియోలు తీసి, తిరువాభరణాల రిజిస్ట్రర్‌లో నమోదు చేశామని వెల్లడించారు. 2010లో జరిగిన ఆభరణాల లెక్కింపులోనూ ఈ రూబీ ముక్కల మూట ఉన్నట్టు జస్టిస్ జగన్నాథరావు తన నివేదికలో పేర్కొన్నారని సుబ్రమణ్యం వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.