ఆ ఇద్దరి వయసు పెద్దగా సమస్యలు ఉండేది కాదు. ఎందుకో తెలీదు. ఇద్దరూ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. భార్గవి పటేల్, సావనీ కాలే... అనే ఇద్దరు బాలికలు ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఎవరైనా మందలించారో తెలియదు, లేదా అనుకోని కష్టమే వచ్చిందో తెలియదు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధఙలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన పెను విషాదాన్నే నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీమార్ట్ వెనుక వైపు సరూర్ నగర్ రోడ్డులో టీఎన్ఆర్ అపార్ట్ మెంట్ ఉంది. అందులో 8వ అంతస్తులో క్రాంతి పటేల్ అనే వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కూతురు భార్గవి పటేల్. బైరామల్ గూడలోని ఆకర్ష అంతర్జాతీయ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చిత్ర లేఅవుట్లో ఉంటున్న నరేంద్ర కాలే డీఆర్డీఏలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కూతురు పేరు సావని. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఇద్దరు కలిసి చదువుకోవాలని సావని, భార్గవి పటేల్ ఉంటున్న టీఎన్ఆర్ అపార్టెమెంట్కు వచ్చింది. భార్గవి కుటుంబ సభ్యులు రాత్రి 7 గంటల ప్రాంతంలో కూరగాయలు కొనేందుకు బయటకెళ్లారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి అపార్ట్ మెంట్ పైకి వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో తలలకు తీవ్ర గాయాలవడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. విద్యార్థినుల ఆత్మహత్యకు కారణాలేం ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీమార్ట్ వెనుక వైపు సరూర్ నగర్ రోడ్డులో టీఎన్ఆర్ అపార్ట్ మెంట్ ఉంది. అందులో 8వ అంతస్తులో క్రాంతి పటేల్ అనే వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కూతురు భార్గవి పటేల్. బైరామల్ గూడలోని ఆకర్ష అంతర్జాతీయ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చిత్ర లేఅవుట్లో ఉంటున్న నరేంద్ర కాలే డీఆర్డీఏలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కూతురు పేరు సావని. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఇద్దరు కలిసి చదువుకోవాలని సావని, భార్గవి పటేల్ ఉంటున్న టీఎన్ఆర్ అపార్టెమెంట్కు వచ్చింది. భార్గవి కుటుంబ సభ్యులు రాత్రి 7 గంటల ప్రాంతంలో కూరగాయలు కొనేందుకు బయటకెళ్లారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి అపార్ట్ మెంట్ పైకి వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో తలలకు తీవ్ర గాయాలవడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. విద్యార్థినుల ఆత్మహత్యకు కారణాలేం ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.