యాప్నగరం

హరికృష్ణ కన్నుమూత.. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవా?

మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం (ఆగస్టు 29) ఉదయం నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

Samayam Telugu 29 Aug 2018, 8:48 pm
మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం (ఆగస్టు 29) ఉదయం నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. బుధవారం, గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంతాప దినాలుగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ రెండు రోజులు అధికారిక వినోద కార్యక్రమాలు జరపరాదని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయనున్నారు.
Samayam Telugu Hari2


హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో ఏపీలో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవా అనే చర్చ మొదలైంది. సెలవులు ఉంటాయేమోనని చాలా మంది ఒకిర్నొకరు సంప్రదించుకుంటున్నారు.

అయితే.. సంతాప దినాలుగా పాటించాలని మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు ఉంటాయని ఎక్కడా చెప్పలేదు. దీంతో అవి యథావిధిగా పనిచేస్తాయనేది స్పష్టమవుతోంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సంతాపంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించినప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం కేవలం సంతాప దినాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.