యాప్నగరం

Chittoor: అంబులెన్స్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాళహస్తి మండలం ఇసుకగుంట దగ్గర అంబులెన్స్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

Samayam Telugu 26 Nov 2018, 9:43 am
చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాళహస్తి మండలం ఇసుకగుంట దగ్గర అంబులెన్స్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తిని బెంగుళూరు నుంచి నెల్లూరుకు తీసుకువెళుతున్న అంబులెన్స్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం శ్రీకాళహస్తి హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదంతో శ్రీకాళహస్తి- తిరుపతి రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Samayam Telugu chittoor


అంబులెన్స్, లారీ రహదారి మధ్యలో అడ్డంగా పడిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌ జాం అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, లారీ- అంబులెన్స్‌లను క్రేన్ సాయంతో అడ్డుతొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు ఉదయం పూట మంచు భారీగా కురువడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.