యాప్నగరం

ఇంటి నిర్మాణంలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరి దుర్మరణం

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కారణంగా ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 1 Nov 2018, 10:31 am
హైదరాబాద్ : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హైటెన్షన్ వైర్ల కారణంగా కరెంట్ షాక్ తగలడంతో.. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. చిక్కడపల్లి సీఐ సైరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌లింగంపల్లి ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో నివాసం ఉండే మన్సూక్‌లాల్ (70) తన ఇంటి రెండో అంతస్తులో పెంట్ హౌస్ నిర్మాణం ప్రారంభించాడు. ఇందు కోసం ఇనుప కడ్డీలను కింది నుంచి పైకి అందిస్తుండగా.. అవి హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలాయి.
Samayam Telugu dead


ఇనుప కడ్డీల్లోకి కరెంట్ ప్రవహించడంతో.. మన్సూక్‌లాల్‌తోపాటు వాహిద్ అనే కార్మికుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు. వారిని కాపాడే ప్రయత్నంలో ఇంటి యజమాని కుమారుడు, పొరుగింట్లో ఉండే యువకుడు కూడా గాయపడ్డారు. అనూహ్యంగా ఇద్దరు మరణించడంతో.. ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.