యాప్నగరం

ఏపీలో నూతన ఎమ్మెల్సీలు వీళ్లే..!

రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ ఆదేశాల మేరకు వీరి నియమితం జరిగింది.

TNN 22 Jul 2017, 7:53 am
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితం అయ్యారు ఫరూక్, రామసుబ్బారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో గవర్నర్ ఆదేశాల మేరకు వీరి నియమితం జరిగింది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, ఆర్.రెడ్డప్పరెడ్డిల పదవీకాలం ముగియడంతో.. వారి స్థానంలో ఫరూక్, సుబ్బారెడ్డిలు నామినేట్ అయ్యారు. వీరి పదవీకాలం ఆరు సంవత్సరాలు.
Samayam Telugu two members nominated fo ap legislative council
ఏపీలో నూతన ఎమ్మెల్సీలు వీళ్లే..!


కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన నేత ఫరూక్. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఫరూక్ కు బాబు ప్రాధాన్యతను ఇచ్చారు. నంద్యాల్లో టీడీపీని గెలిపిస్తే ఫరూక్ కు ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. అయితే ఉప ఎన్నిక కన్నా ముందే ఎమ్మెల్సీ పదవి లభించడం విశేషం. అలాగే మండలి చైర్మన్ పదవిని కూడా ఇస్తానని బాబు ఫరూక్‌కు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి... కొన్నాళ్లుగా అసమ్మతివాదిగా ఉన్నారు. తన నియోజకవర్గంలో వైకాపా తరపున ఎమ్మెల్యేగా నెగ్గిన ఆదినారాయణ రెడ్డిని టీడీపీలోకి చేర్చుకోవడంతో రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి కూడా దక్కడంతో సుబ్బారెడ్డి తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ఈయన తెలుగుదేశాన్ని వీడి వైకాపాలో చేరతాడనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.