యాప్నగరం

విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ .. మరో ఇద్దరు మృతి

తెలంగాణ ప్రజల్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి.. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు మృతి..

Samayam Telugu 14 Nov 2018, 4:42 pm
తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫ్లూ దెబ్బకు ఇప్పటికే 15మంది చనిపోగా.. మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో ఫ్లూ మరణాల సంఖ్య 17కు చేరింది. గాంధీలో మరో తొమ్మిది మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. వీరిలో ముగ్గురికి ఫ్లూ సోకగా.. మరో ఆరుగురికి లక్షణాలు మాత్రమే ఉన్నాయని సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఆగష్టు నుంచి ఇప్పటి వరకు మొత్తం 480 కేసులు నమోదైతే.. హైదరాబాద్‌లో 215.. రంగారెడ్డి జిల్లాలో 82.. మేడ్చల్ జిల్లాలో 80 ఉన్నాయి.
Samayam Telugu gandhi


తెలంగాణలో స్వైన్ ఫ్లూ అంతకంతకూ విస్తరిస్తుండటంతో జనాలు వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 16 నుంచి 17 కేసులు నమోదవుతున్నయని చెబుతున్నారు అధికారులు. వాటిలో చాలా తక్కువమంది ఫ్లూ బారిన పడుతున్నారని.. వచ్చే జనవరి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందంటున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. రాబోయే రోజుల్లో ఎన్నికల బహిరంగ సభలు, కార్యక్రమాలు ఉండటంతో.. ఈ ఫ్లూ మరింత విస్తరించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

స్వైన్ ఫ్లూ విషయంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్లు. వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ ఉన్న వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే అది ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. చలి వాతావరణంలో ఈ వైరస్ మరింత త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. కాబట్టి బయటకు వెళ్లేప్పుడు మాస్కులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.