తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమయ్యారు. గవర్నర్ సమక్షంలో వారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడుతో సహా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరవ్వగా, తెలంగాణ నుంచి మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ హాజరయ్యారు. రాష్ట్రంగా రెండుగా విడిపోయాకా ఏర్పడిన పరిస్థితులు, సమస్యల గురించి చర్చించారు. సమస్యలపై కోర్టులకు వెళ్లడం కన్నా కూర్చుని మాట్లాడుకుంటేనే మంచిదని వారు సమావేశంలో అభిప్రాయపడ్డారు. కృష్ణాజలాలతో పాటూ ఉమ్మడి సమస్యలపై కలిసి పోరాడాలని వారు నిర్ణయించినట్టు సమాచారం. గవర్నర్ కూడా సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం చేస్తానని అన్నారు.
సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల భేటీ
దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమయ్యారు.
TNN 1 Feb 2017, 6:33 pm