యాప్నగరం

మహిళలను చంపి మూసీ నదిలో.. లంగర్‌హౌజ్‌లో దారుణం

హైదరాబాద్ శివార్లలోని లంగర్‌హౌజ్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి చంపి హత్య చేశారు. అనంతరం మృతదేహాలను మూసీ నదిలో విసిరేశారు.

Samayam Telugu 22 Jan 2019, 11:29 pm
హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలను కిరాతకంగా హత్య చేశారు. కర్రలతో కొట్టి చంపి మృతదేహాలను మూసీ నదిలో విసిరేశారు. సోమవారం (జనవరి 21) రాత్రి ఈ దారుణం జరిగినట్లు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం మూసీ నదిలో మహిళల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Samayam Telugu musi


ఆ మహిళలు ఎవరు? వాళ్లను అతి దారుణంగా ఎందుకు హత్య చేశారనే విషయాలు అంతుబట్టడం లేదు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.